Monday, November 9, 2015

ఒక ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన

రాయలసీమకు వరప్రదాయిని అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టుపై టీడీపీ సర్కారు శీతకన్నేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఈ ప్రాజెక్టుకు రెండుసార్లు పునాదిరాళ్లు వేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం కాలువ పనులు పూర్తిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దివంగత నేత వైఎస్ హయాంలో మూడొంతుల పనులు పూర్తిచేసినా... చంద్రబాబు మాత్రం మాటలతో పొద్దుపొచ్చుతూ అనంత జిల్లా రైతాంగాన్ని మభ్యపెడుతున్నారు.
      గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా టీడీపీకి బ్రహ్మరథం పట్టింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లా పచ్చపార్టీని బాగానే ఆదరిస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం అనంత జిల్లాకు చెప్పుకోదగ్గ మేలు చేసిన పాపాన పోలేదు. అనంత ఎన్టీఆర్ కు ఇష్టమైన జిల్లా అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు.. ఇరవై ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకుండా లోటు బడ్జెట్ సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. బాబు తీరుపై స్థానిక టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment