Tuesday, November 10, 2015

మిల్లర్లతో బాబు మిలాఖత్

రైస్ మిల్లర్లో సీఎం చంద్రబాబు మిలాఖత్ అయ్యారని వైసీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్ర ఆరోపించారు. లెవీ ఎత్తివేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, వ్యాపారులు యథేచ్ఛగా దోచుకుంటున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనే నాథుడే లేడని, రవాణా ఖర్చులు కూడా రైతులే చెల్లించాల్సిన దుస్థితి ఉందని నెహ్రూ మండిపడ్డారు.
        రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు విదేశాలకు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. రాజధాని మత్తులో ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారించాలనే ఆలోచన చేయడం లేదన్నారు. రుణమాఫీ పేరుతో ఊరూరా గొప్పలు చెప్పుకుంటూ.. ఇప్పటికి కేవలం 9 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, రైతులు పద్నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తూ నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయని, రైతులు కష్టాలు పడుతున్నారని, సీఎం స్పందించకపోతే తగిన గుణపాఠం తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతైనా బాబుకు కనునిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు కూడా మోడీ తరహాలో నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.

No comments:

Post a Comment