Monday, November 9, 2015

రాజధానిలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం గాలికి..!

రాజధానికి త్వరగా తరలిరావాలని ఉద్యోగులను తొందరపెడుతున్న చంద్రబాబు సర్కారు.. వారికి మౌలికవసతులు కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉద్యోగుల నివాసానికి కీలకమైన ఇళ్ల నిర్మాణంపై సర్కారు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.  ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో.. ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
    పరిశ్రమలు, అస్మదీయులకు వేలాది ఎకరాలు దోచిపెడుతున్న చంద్రబాబు.. స్థలం లేదన్న సాగుతో పది వేల ఇళ్లు రద్దు చేసేశారు. ఇక కరకట్టపై అక్రమనిర్మాణాలు కడుతున్నారనే సాకుతో మరికొన్ని ఇళ్లు రద్దుచేశారు. అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు మాత్రం.. అదే కృష్ణా కరకట్టపై ప్రభుత్వమే అక్రమ నిర్మాణంగా నిర్థారించిన భవనానికి మరమ్మతు చేయించుకుని మరీ దర్జా ఒలకబోస్తున్నారు. సామాన్యుడికి నివాసాలు దూరం చేస్తూ సర్కారు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

No comments:

Post a Comment