Sunday, November 15, 2015

సర్కారు సౌజన్యంతో సంక్షేమ హాస్టళ్లు ఖాళీ

పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సర్కారు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చేరకపోయినా పట్టించుకోవడం లేదు. కనీసం విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో ఆరా తీసే తీరిక కూడా సీఎంకు గానీ, మంత్రులకు కానీ లేదు. అదేమంటే వాళ్లే చేరకపోతే మేమేం చేస్తామని అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు అధ్వాన్నంగా ఉండటమే కారణమని విద్యార్థులు చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
               సాధారణంగా సంక్షేమ హాస్టళ్ల సంఖ్య పంచాలని ఎప్పుడూ నిరసనలు జరుగుతూ ఉండేవి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పరిమితికి మించి ఉన్నారని కూడా గతంలో వార్తలు రావడం మామూలే. చాలా సందర్భాల్లో అధికారులు తామిక చేర్చుకోలేమని చేతులెత్తేశారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కరవు జిల్లా అనంతపురంలో పనుల్లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నా.. పిల్లల్ని మాత్రం వసతిగృహాల్లో చేర్చేందుకు ముందుకు రావడం లేదు.
                 వసతి గృహాల్లో పిల్లల చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపడం లేదని నిరసన వ్యక్తమౌతోంది. వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నా, చదువుకోకపోయినా ఒక్కటే అనేంతగా నాసిరకమైన ప్రమాణాలున్నాయి. విద్యార్థుల చదువులపై అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఆ మాత్రం దానికి తమ పిల్లల్ని ఎక్కడో దూరంలో ఉండే హాస్టళ్లలో చేర్పించడం ఎందుకని తల్లిదండ్రులు భావిస్తున్నారు.                 

No comments:

Post a Comment