Monday, November 30, 2015

కలెక్టర్ కు షాకిచ్చిన జన్మభూమి కమిటీ

ఏపీలో అధికార పార్టీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు ఎంత బాగా పనిచస్తున్నాయో అనంతపురం జిల్లా కలెక్టర్ సాక్షిగా బట్టబయలైంది. వికలాంగుడికి పించన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీకి.. ఆధార్ కార్డు లేదని అద్భుతమైన సాకు చూపించింది. ఓవైపు కోర్టులు ఆధార్ తప్పనిసరి కాదని చెబుతున్నా అధికారులు మాత్రం ఒంటెత్తుపోకడ పోతున్నారనడానికి ఇదే నిదర్శనం.
          అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమానికి ఓ వికలాంగుడు హాజరయ్యాడు. కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్న వికలాంగుడు.. తనకు ఆధార్ లేదని పెన్షన్ నిలిపేశారని ఫిర్యాదు చేశాడు. వికలాంగుడు మరుగుజ్జు కావడంతో అతడ్ని తన టేబుల్ పై కూర్చోబెట్టుకున్న కలెక్టర్.. ఆన్ లైన్ లో ఎంపీడీవోతో మాట్లాడి ఆరా తీశారు. ఆధార్ ను కూడా నమోదు చేయించారు. ఇకపై ఏ ఇబ్బంది ఉన్నా తన దగ్గరకు రావాలని సూచించారు.
      అయితే వికలాంగులందరూ కలెక్టర్ కు వస్తారా, వచ్చినా కలెక్టర్ తో మాట్లాడే వీలు చిక్కుతుందా అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఏవో ఒక్క కేసు చూసి కలెక్టర్ న్యాయం చేస్తే సరిపోదని, జిల్లావ్యాప్తంగా జన్మభూమి కమిటీల బాగోతం ఇలాగే ఉందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. పచ్చచొక్కాల పైత్యం ముదరక ముందే కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటే కలెక్టర్ కు కూడా ముప్పు తప్పదనే సంగతి బహిరంగ రహస్యమే.

No comments:

Post a Comment