Thursday, November 19, 2015

కడపలో లిక్కర్ దందా

ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో ఖజానాకు చిల్లు పడటమే కాకుండా.. మద్యప్రియలు జేబుకు కూడా చిల్లు పడుతోంది. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేసి, ప్రైవేటు వారికి లీజుకు ఇవ్వడంతో.. వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎమ్మార్పీ ధరకు అమ్ముతామని చెప్పి, ఆమేరకు పన్నులు కడుతున్న వ్యాపారులు.. మద్యాపాన ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ భారీ లాభాలు కళ్లజూస్తున్నారు.
                 వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే దందా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడక్కడా తూతూమంత్రంగా దాడులు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు చేసే దోపిడీతో పోలిస్తే అధికారులు జరిమానాలు పదో వంతు కూడా కాదని సమాచారం.
             ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తేయడం వెనుక పచ్చచొక్కాలు కీలక పాత్ర పోషించిన సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లో కూడా చాలామంది వారి అనుయాయులేనని, అధికారపార్టీతో మనకు గొడవెందుకని అధికారులు కూడా కిమ్మనట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం షరామామూలుగా దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. 

No comments:

Post a Comment