Tuesday, November 17, 2015

తెలుగు తమ్ముళ్ల రూటేవేరు

టీడీపీ సర్కారు హయాంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలపై కూడా ఆగడాలు మితిమీరుతున్నాయి. తప్పులు చేసిన అధికార పార్టీ నేతలను వెనకేసుకొస్తున్న సర్కారు.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా రోడ్డు వేయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యల్లేవు కానీ, ప్రజల పక్షాన పోరాడుతున్న ఎమ్మెల్యేలు కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
         గుడివాడ వైసీపీ ఆఫీస్ సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసులు కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొడాలి నానికి ఆఫీస్ ఓనర్ ఇచ్చిన గడువు ఇంకా ఉన్నప్పటికీ.. పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల ప్రోద్బలం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
             పేర్నినాని కూడా రాజధాని భూసేకరణ విషయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో తెలుగు తమ్ముళ్లపై ఆయన్ను టార్గెట్ చేశారు. మచిలీపట్నంలో మద్యం షాపుల్లో తనిఖీలకు వెళ్లిన అధికారులు.. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో నానిని అరెస్ట్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ సభల్లో భూసేకరణపై ఆందోళన చేయిస్తున్నారని పేర్నినానిపై కక్ష పెంచుకున్నారని వైసీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. 

No comments:

Post a Comment