Monday, November 30, 2015

ఉపాధ్యాయులకు సర్కారు వాత

ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హడావిడిగా టీచర్ల బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ.. తమ తప్పును ఉపాధ్యాయులను నెత్తికి రుద్దేసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీలు జరిగాయి కాబట్టి ఆ ఉపాధ్యాయులందరికీ వేతనం నిలిపేయాలని ఖజనాకు ఉత్తర్వులందాయి. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు చూసి ఉపాధ్యాయులు విస్తుబోతున్నారు.
          శాఖల మధ్య సమన్వయ లేమికి ప్రభుత్వం భాద్యత వహించాలి గానీ, నిబంధనల ప్రకారం బదిలీ అయిన తమకు జీతం ఆపేయడమేమిటని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెల జీతాలు ఆగిన నేపథ్యంలో జీతాలు వచ్చేవరకు టీచర్లు స్కూళ్లకు వెళతారా.. లేదంటే నిరసన తెలుపుతారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
         అర్థసంవత్సర పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో సర్కారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం బాగాలోదేని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అనుమతి తీసుకోకపోతే.. విద్యాశాఖ ఇప్పుడైనా ఫైల్ ఖజానాకు పంపించవచ్చని, అదేమంత పెద్ద తప్పిదం కాదని, ఏదో ఓ సాకు చూపి జీతాలు ఆపాలనే ఇలా చేస్తున్నారేమోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment