Monday, November 9, 2015

పచ్చ ప్రభుత్వానికి బాక్సైట్ పంచ్

ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు పోరాటాలు చేసిన చంద్రబాబు.. సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు వచ్చేలా చేయడంపై మన్యంలో ఉద్యమం రాజుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యమకారులు.. గతంలో మాదిరిగా ఉధ్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు బాక్సైట్ ఉద్యమానికి మావోయిస్టులు కూడా మద్దతు పలకడంతో.. వేడి మరింతగా రాజుకుంటోంది.
             బాక్సైట్ తవ్వకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తమ అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోవడం లేదని.. మన్యంలో తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ముందుకెళితే తాము పార్టీని వీడాల్సి వస్తుందని చెప్పినా.. చంద్రబాబు మొండి పట్టు పట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల బాక్సైట్ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షం అండగా నిలుస్తోంది. వైసీపీకి మన్యంలో లభించిన అపూర్వ స్వాగతం.. బాక్సైట్ విషయంలో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చాటిచెబుతోంది. 

No comments:

Post a Comment