Thursday, November 12, 2015

అధికార పార్టీ లిక్కర్ దందా

 మద్యం టెండర్ల విషయంలో పచ్చ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. మద్యం వ్యాపారులను బెదిరించి కొన్ని దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా చేశారు. ఇక సిండికేట్ అయిన మద్యం వ్యాపారుల నుంచి తమ వంతు మామూళ్లు వసూలు చేస్తున్నారు. లిక్కర్ ను నియంత్రిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఊరూ వాడా ఊదరగొడుతున్న చంద్రబాబు.. తమ పార్టీ నేతలు లిక్కర్ దందా కొనసాగిస్తూనే.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు.
          అనంతపురం జిల్లాలో మద్యం టెండర్ల వ్యవహారం గమనిస్తే అధికార పార్టీ నేతల బాగోతం బయటపడుతుంది. జిల్లాలో మొత్తం 29 దుకాణాలకు టెండర్లు పిలవగా.. ఎనిమిది దుకాణాలకు ఒక్క టెండర్ కూడా రాలేదు. ఈ షాపుల వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని అందరూ భావిస్తున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన వ్యాపారులను బెదిరించి వెనక్కుపంపినట్లు ఆరోపణలున్నాయి.
        అధికార పార్టీ నేతల అక్రమాలకు అధికారులు కూడా అండగా నిలవడంతో.. మద్యం టెండర్లు దాదాపుగా ఏకపక్షంగా ముగిశాయి. మద్యం నుంచే ఖజానాకు భారీ ఆదాయం వస్తోందని చెప్పుకుంటున్న సర్కారు.. మద్యం టెండర్లలో అక్రమాలు జరిగి ఖజానాకు చిల్లు పడుతున్నా.. మనవాళ్లే కదా అని చూసీచూడనట్లు పోతోంది. పచ్చ తమ్ముళ్ల దోపిడీ ఇలాగే సాగితే.. ఖజానాకు పెద్ద చిల్లు పడుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు.

No comments:

Post a Comment