తూర్పుగోదావరి జిల్లా వంతాడ పరిసరాల్లో లేటరైట్ మైనింగ్ పై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మైనింగ్ జరుగుతోందని నిర్థారించారు. గిరిజనులకు సంబంధించిన 94 ఎకరాలపై లీజులు రద్దు చేయాలని కమిటీ అధికారులకు సూచించింది. గతంలో రెండుసార్లు ఆదేశాలిచ్చినా ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
లేటరైట్ అక్రమ మైనింగ్ తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పీఏసీ గుర్తించింది. లీజుకు తీసుకున్న భూమిలో ప్రభుత్వ అనుమతిప్రకారం 12 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని, అనుమతులకు విరుద్ధంగా ఉన్న రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల సర్వేలో తప్పుల దొర్లాయని, గ్లోబల్ పొజిషనింగ్ విధానం ద్వారా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులకు కమిటీ సూచించింది.
ఇక లేటరైట్ మైనింగ్ కారణంగా తామంతా కాలుష్యం బారిన పడుతున్నామని స్థానికుల పీఏసీ దృష్టికి తెచ్చారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లేటరైట్ మైనింగ్ కారణంగా రావికంపాడు వద్ద రైల్వేగేటు 18 గంటలపాటు మూసి ఉంచడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వానికి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కమిటీ హెచ్చరించింది. మరోవైపు లేటరైట్ అక్రమాల వెనుక పచ్చతమ్ముళ్లు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లేటరైట్ అక్రమ మైనింగ్ తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పీఏసీ గుర్తించింది. లీజుకు తీసుకున్న భూమిలో ప్రభుత్వ అనుమతిప్రకారం 12 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని, అనుమతులకు విరుద్ధంగా ఉన్న రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల సర్వేలో తప్పుల దొర్లాయని, గ్లోబల్ పొజిషనింగ్ విధానం ద్వారా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులకు కమిటీ సూచించింది.
ఇక లేటరైట్ మైనింగ్ కారణంగా తామంతా కాలుష్యం బారిన పడుతున్నామని స్థానికుల పీఏసీ దృష్టికి తెచ్చారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లేటరైట్ మైనింగ్ కారణంగా రావికంపాడు వద్ద రైల్వేగేటు 18 గంటలపాటు మూసి ఉంచడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వానికి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కమిటీ హెచ్చరించింది. మరోవైపు లేటరైట్ అక్రమాల వెనుక పచ్చతమ్ముళ్లు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment