Thursday, November 26, 2015

చెకింగ్ లకు చెక్

రవాణాశాఖ తనిఖీ కేంద్రాల్లో సిబ్బంది సరికొత్త దందాకు తెరలేపారు. రోజువారీ తనిఖీలు, వసూళ్లు తలనొప్పి ఎందుకని, నెలవారీ మామూళ్లు మాట్లాడేసుకున్నారు. దీంతో చెక్ పోస్టుల్లో అధిక లోడ్ తో వెళ్లే వాహనాలు, వాహనాల్లో ఏ సరుకు ఉందో కూడా తనిఖీ చేయకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా పంచలింగాల, డోన్ చెక్ పోస్టుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది.
            చెక్ పోస్టుల వల్ల రవాణా సిబ్బంది ఆశాఖ కమిషనర్ ఆదేశాలను కూడా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవాణాశాఖ అవినీతిపై ఫిర్యాదులు వెెల్లువెత్తడంతో ఇంటెజలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో విచారణలో మొదలైనట్లు తెలుస్తోంది. అయితే నెలవారీ మామూళ్లు కేవలం రవాణా శాఖ అధికారులకే కాదని, అందులో అధికార పార్టీ నేతలకూ వాటాలు ఉంటాయని కొంతమంది చెబుతున్నారు.
         చెక్ పోస్టుల వద్ద పనులు సరిగ్గా జరగడం లేదన్నవారు.. అక్కడ ఉండే సౌకర్యాలు, సిబ్బందిపైనా దృష్టిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇద్దరు అధికారులు, ఇద్దరు హోంగార్డులు చేయాల్సిన పని ఒకే అధికారి ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చెక్ పోస్టుల్లో వేబ్రిడ్జి సదుపాయం లేకపోవడంతో ఏ వాహనం ఎంత లోడ్ తో వెళ్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారుతోంది. 

No comments:

Post a Comment