Wednesday, November 25, 2015

పిఠాపురంలో పచ్చ చిచ్చు

ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం కత్తులు దూసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వర్మ ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవల మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశం మీదా ఎంపీ, ఎమ్మెల్యే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతున్నారు.
           గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్మకు పిఠాపురం టికెట్ ఇవ్వకపోవడంతో.. స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిన వర్మ.. మొదట్లో ఎంపీ తోటతో బాగానే ఉన్నారు. వర్మ ఒంటెత్తు పోకడలు నచ్చక కొంతమంది నేతలు తోట పంచన చేరడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఎన్నికల్లో తనకు సహకరించకుండా.. టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వానికి సహకరించిన సొసైటీ అధ్యక్షుల్ని వర్మ టార్గెట్ చేసి, పదవి పోయేలా చేశారు. దీంతో వివాదం మరింత రాజుకుంది.
           చివరకు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా వర్మే చక్రం తిప్పుతున్నారు. తోట కూడా అధిష్ఠానం వద్ద ఏమీ చేయలేకపోవడంతో.. ఏలేరు పరిధిలో పిఠాపురం సాగునీటి సంఘాల ప్రాతినిథ్యం తగ్గించారు. అయినా సరే ఏమాత్రం తగ్గని వర్మ.. ఏకంగా పిఠాపురం మున్సిపాల్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ.. తోటకు తలనొప్పిగా మారారు. తోట అనుచరుడైన మున్సిపల్ ఛైర్మన్ ఎప్పటికప్పుడు వర్మకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే గొడవలతో టీడీపీ శ్రేణులు కూడా రెండుగా చీలిపోయాయి. 

No comments:

Post a Comment