Saturday, November 28, 2015

సంక్షేమానికి చెదలు

ఏపీలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిబ్బంది ఏటా పదవీ విరమణ చేస్తున్నా కొత్తవారిని నియమించకుండా.. సర్కారు కాలయాపన చేస్తోంది. కనీసం వర్కర్లను కూడా తీసుకోకుండా కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తూ మమ అనిపించడంతో.. హాస్టళ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.
         ప్రతి హాస్టల్ కు వార్డెన్, వర్కర్, ఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి. కానీ 90 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంతో.. ఉన్నవాళ్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సాధారణంగానే వార్డెన్లు వాళ్లిష్టమైనప్పుడు హాస్టళ్లకు వెళుతుంటారు. అలాంటిది అదనపు బాధ్యతలంటే ఎంత బాగా పర్యవేక్షిస్తారో బహిరంగ రహస్యమే.
         హాస్టళ్లో పిల్లలకు ఆరోగ్య సమస్యలున్నాయా, ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తోందా లేదా. స్కాలర్ షిప్పుల సంగతేంటి.. అని పట్టించుకునే వారే కరువయ్యారు. కాంట్రాక్టు వర్కర్లు కావడంతో వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా పనిచేస్తున్నారు. వీరిపై పర్యవేక్షణ కొరవడటంతో. విద్యార్థులు నష్టపోతున్నారు. సర్కారు తీరుపై హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment