Sunday, November 29, 2015

పోర్టుపై ప్రైవేటు పెత్తనం

ఏపీలో జలరవాణాకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న సర్కారు.. ఆ సాకుతో ప్రైవేటువారికి ఆధిపత్యం కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పోర్టులో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు, కార్మికుల పొట్ట కొట్టడానికి కూడా ప్రణాళిక సిద్ధమైపోయింది. కేంద్రం చట్టం, రాష్ట్రం పాలసీ రెండూ అమల్లోకి వస్తే ఇక పోర్టులో కార్మికుల గతి అథోగతే అవనుంది.
       విశాఖ పోర్టులో ఇన్నర్, అవుటర్ హార్బర్లున్నాయి. వీటిలో మొత్తం 24 దాకా బెర్త్ లు ఉన్నాయి. విదేశాల్లో నౌకారవాణా 40 శాతం ఉంటే.. మన దేశంలో 7 శాతమే ఉంది. రోడ్డు రవాణాతో పోలిస్తే సగం ఖర్చుకే నౌకారవణా సాధ్యామౌతుంది. ఈ సాకుతో కేంద్ర పోర్టు ట్రస్టు చట్టానికి సవరణ చేసి, పోర్టులను ట్రస్టుల మాదిరి కాకుండా కంపెనీలుగా మార్చాలని ప్లాన్ చేస్తోంది.
       పోర్టులు కంపెనీలుగా మారితే ప్రైవేటు వారి గుత్తాధిపత్యం పెరిగి కార్మికుల ఉపాధికి గండి పడుతుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా పోర్టులు అభివృద్ధి అయ్యే మాట నిజమే అయినా.. ప్రజలతో సంబంధం లేని అభివృద్ధి ఎవరి కోసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. యంత్రాలతోనే అభివృద్ధి పనులు చేసి, కొందరు పెద్దలు బాగుపడటానికి సర్కారే చట్టసవరణ చేయడం శోచనీయమని విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment