Sunday, November 29, 2015

లైన్లో ఉండకపోతే పస్తులే

మధ్యాహ్న భోజన పథకంలో కొత్ పద్ధతులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. పలు స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్నెంట్ అందుబాటులో లేదన్న వాస్తవాన్ని గుర్తించకుండా విద్యార్థుల హాజరు రోజుకు రెండుసార్లు ఆన్ లైన్లో నమోదు చేయాలనడం వివాదాస్పదమైంది.
            విజయనగరం జిల్లాలో మొత్తం మూడు లక్షల నలభై వేల మంది విద్యార్థులుండగా.. వారిలో 2.9 లక్షల మంది వివరాలు ఆన్ లైన్లో నమోదయ్యాయి. వీరిలో ఎనభై వేల మంది ప్రైవేట్ విద్యార్థులు, మిగతా వారు ప్రభుత్వ విద్యార్థులు. ఇంకా యాభైవేల మంది విద్యార్థుల వివరాలు అధికారులు నమోదు చేయలేదు. వీరంతా మధ్యాహ్న భోజన పథకానికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
            యాభై వేల మంది ఇరవై వేల మంది ప్రైవేట్ విద్యార్థులు కాగా. మిగతావారు ప్రభుత్వ విద్యార్థులు. ప్రభుత్వ విద్యార్థులకు నిబంధన ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయాలి. అయితే సర్కారు అలసత్వం అధికారుల బాధ్యతారాహిత్యంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా స్కూళ్లలో ఉపాధ్యాయులే ఈ వివరాలు నమోదు చేయాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది.

No comments:

Post a Comment