Sunday, November 15, 2015

అన్నమో రామచంద్రా..!

మధ్యాహ్న భోజన పథకం నిధుల కొరతతో అలమటిస్తోంది. మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మే నుంచి బిల్లులు విడుదల కాలేదని, పైగా పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా డబ్బులు పెంచలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నిధులు ఇచ్చినప్పుడే కొన్నిచోట్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడి పిల్లలను పస్తులించిన సందర్భాలున్నాయి. ఇక ఐదు నెలల నుంచి బిల్లులే రాకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
             సర్కారు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో పప్పు, సాంబారు తప్పనిసరి. అయితే ధరలు పెరిగిపోవడంతో.. నిర్వాహకులు బెల్లం అన్నం, పెరుగన్నంతో సరిపెడుతున్నారు. ఇక వారానికి రెండుసార్లు గుడ్డు వడ్డించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ గుడ్డు ధర కొండెక్కి ఐదు రూపాయలకు చేరుకోవడంతో.. ప్రస్తుతం నెలకు రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు.
                 బిల్లుల విడుదల, ధరల పెరుగుదల గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతమంది పిల్లల్ని బడి మానిపించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శలు వస్తున్నాయి.  

No comments:

Post a Comment