Thursday, November 26, 2015

రోడ్డు మేసేశారు

50 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు నెలల వ్యవధిలో నిర్మించిన రోడ్డు.. నాలుగు రోజుల వర్షానికే రంగు వెలిసిపోయింది. గతంలో కచ్చారోడ్డు ఉన్నా వాహనాలైనా తిరిగేవని, ఇప్పుడు పాదచారులు కూడా నడవలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి సమీపంలో రెండు ఎస్సీ కాలనీలకు వేసిన రోడ్డు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
        సాధారణంగా రోడ్డువేసేటప్పుడు మూడు లేయర్లలో మట్టి, కంకర, చిప్స్ వేయాలి. ప్రతి లేయర్ పూర్తయ్యక పూర్తిస్థాయిలో చదును చేయాలి. గ్రావెల్ కూడా నాణ్యమైనది అయ్యుండాలి. సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజినీర్లు రోడ్డు నిర్మాణం ప్రతి దశలోనూ పర్యవేక్షించాలి. ఇక్కడ ఆ పర్యవేక్షణ కరవవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమైపోయింది.
          మొదటి లేయర్ చిప్స్, రెండో లేయర్ కంకర వేసి, మూడో లేయర్ లో ఎర్ర గ్రావెల్ వేశారు. అయితే ఎర్రగ్రావెల్ నాణ్యత లేదని అధికారులు గుర్తించి కొంత మార్పించినా.. అది కూడా నాణ్యమైనది వేయాలి. ప్రతి లేయర్ కు రోలింగ్ చేయకుండా.. అంతా పూర్తయ్యాక చదును చేశారు. అందుకే మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు అంతా మట్టికొట్టుకుపోయి బురుదమయంగా మారింది. 

No comments:

Post a Comment